తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

    హైదరాబాదు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

    READ MORE
  • జనసేన గాజు గ్లాసు గుర్తుపై టీడీపీ అత్యవసర పిటిషన్… కీలక వ్యాఖ్యలు చేసిన ఈసీ

    అమరావతి: గాజు లోటా గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా, ఏపీ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. గాజు లోటా గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు లోటా గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన చెందుతోంది. టీడీపీ పిటిషన్ పై నేడు

    READ MORE
  • ఇంటింటికీ మేనిఫెస్టో

    అమరావతి: ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన కార్యక్రమానికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఃసిద్ధంః పేరిట బహిరంగ సభలు, ఃమేమంతా సిద్ధంః పేరుతో బస్సు యాత్రలను తమ పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్లో

    READ MORE
  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • రెండు స్థానాల్లో టీఆర్ఎస్ బోణీ

    హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బోణీ కొట్టింది. రెండు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. మెట్టగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాసురి సునిత గెలుపొందారు. యూసుఫ్‌గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ ఘన విజయం సాధించారు. మెజార్టీ పై అధికారిక ప్రకటన వెలు వడాల్సి ఉంది. ప్రస్తుతం 21 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ-15 స్థానాల్లో, కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంలో మాత్రం ఆధిక్యంలో ఉంది. ఖైరతాబాద్, అమీర్‌పేట్, సనత్‌నగర్‌తో పాటు పలు డివిజన్లలో

    READ MORE
  • తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

    హైదరాబాదు:జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.12.30 గంటల ప్ప్రాంతంలో తొలి రౌండ్‌లో 23 డివిజన్లలో కౌంటింగ్ పూర్తయ్యింది. ఇందులో టీఆర్ఎస్ ఆధిక్యం కనబర్చింది. ఆర్సీపురంలో , పటాన్ చెరువు డివిజన్లు, చందా నగర్, హఫీజ్ పేట‌, హైదర్ నగర్, జూబ్లి హీల్స్, ఖైరతాబాద్, బాలానగర్, ఓల్డ్ బోయినపల్లి, చర్లపల్లి, కాప్రా, మీర్ పేట్, శేరిలింగంపల్లి, గాజులరామారం, రంగారెడ్డి నగర్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగింది. 12 చోట్ల మాత్రం బీజేపీ ఆధిక్యం కనబర్చింది.పోస్టల్ బ్యాలెట్లలో మాత్రం బీజేపీ ఆధిక్యం

    READ MORE
  • వివేకానందనగర్‌ లెక్కింపు‌ కేంద్రంలో గందరగోళం

    హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో చిత్ర విచిత్రాలు సంభవించాయి. ఒకచోట పోలైన ఓట్ల కంటే పెట్టెలో తక్కువ ఉన్నాయి. మరో డివిజన్లో పోలైన ఓట్ల కంటే పెట్టెలో ఎక్కువగా ఓట్లు కనిపించాయి. వివేకానందనగర్ లెక్కింపు కేంద్రంలో ఇలాంటి గందరగోళం నెలకొంది. ఈ డివిజన్లో 355 ఓట్లు పోలైతే 574 ఉన్నాయని అధికారులు చెప్పారు. దీనిపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు. గోషామహల్ నియోజకవర్గంలో సైతం ఇంచుమించు ఇలాంటి పరిస్థితే. జాంబాగ్ డివిజన్లోని నెంబర్ 8

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు