చిత్తూరు ; వీ. కోట పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 126 గ్రాముల బంగారం, 560 గ్రాముల వెండి, రూ.లక్ష నగదు, ఓ ల్యాప్టాప్, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఓ కారు పట్టుబడ్డాయి. ముఠాలోని ఏడు మంది దొంగలు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటకల్లో వీరిపై 29 కేసులున్నాయని పలమనేరు డీఎస్పీ అరీఫుల్లా వెల్లడించారు. దొంగలను రిమాండుకు తరలించారు.