తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • కొడాలి నానికి అస్వస్థత

    అమరావతి:మాజీ మంత్రి, వైసిపి నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతిలో నొప్పిగా ఉండటంతో హైదరాబాదు,గచ్చిబౌలిలోని విఐజి ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించగా ఆయనకు గుండెలో సమస్య ఉన్నట్లు గుర్తించారు. గ్యాస్టిక్‌ సమస్య ఉందని ఆస్పత్రిలో చేరితే పరీక్షల అనంతరం అది గుండె సంబంధిత సమస్యగా డాక్టర్లు నిర్థారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    READ MORE
  • పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై టిడిపి, జనసేన మౌనం రాష్ట్రానికి హానికరం

    విజయవాడ : పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అంశంలో కూటమి పార్టీల వైఖరి ఏమిటో చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. సోమవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావులతో కలసి ప్రసంగించారు. డీలిమిటేషన్‌పై డిఎంకె ఏర్పాటు చేసిన సమావేశానికి ఎపి తప్ప దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి అన్ని పార్టీలూ ఒకే తాటిమీదకు వచ్చి హాజరయ్యాయని అన్నారు. అయితే ఎపిలోని కూటమి పార్టీల వైఖరి రాష్ట్ర ప్రయోజనాలకు నష్టమని, పార్లమెంటులో

    READ MORE
  • ఉచిత పంటల బీమాను రైతుల హక్కుగా అమలు చేశాం

    అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షం కారణంగా పులివెందుల నియోజకవర్గంలో పంట నష్టపోయిన అరటి రైతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం పరామర్శించారు. ఉదయం వైఎస్సార్ జిల్లా తాతిరెడ్డిపల్లికి జగన్ చేరుకున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో పంట బీమాను రైతుల హక్కుగా అమలుచేశామని చెప్పారు. రైతు భరోసా నిధులు క్రమం తప్పకుండా అందించామని గుర్తుచేశారు.కూటమి ప్రభుత్వం వచ్చాక పంట బీమాకు

    READ MORE
  • నాలుగు రోజుల పాటు వడగళ్ల వాన

    అమరావతి:ఏపీలో పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో, చేతికి అందివచ్చిన పంట నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. మరో నాలుగు రోజుల పాటు అకాల వర్షాలు కురుస్తాయని, వడగళ్ల వాన కురుస్తుందని, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.క్యుములోనింబస్ మేఘాల కారణంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ

    READ MORE
  • ఆ రోడ్లకు టోల్‌ విధించే ఆలోచన లేదు

    హైదరాబాద్‌: గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్‌ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు శాసనసభలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఆరు నెలలు లేదా మూడు నెలలకు వారికి చెల్లిస్తామన్నారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్‌ రోడ్లు వేయిస్తామని తెలిపారు. భారాస హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే రోడ్లు వేశారని చెప్పారు.  ఆ మూడు చోట్ల రోడ్లకు చివరికి సింగరేణి నిధులు

    READ MORE
  • డీలిమిటేషన్ సదస్సుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

    హైదరాబాద్: ఈ నెల 22న చెన్నైలో జరిగే డీలిమిటేషన్‌ సదస్సుకు కాంగ్రెస్ తరపున టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరవుతున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. డీఎంకే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల నాయకులందరూ పాల్గొనబోతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నట్లు  ప్రకటించిన సంగతి తెలిసిందే.

    READ MORE
  • హైకోర్టును ఆశ్రయించిన యాంకర్‌ శ్యామల

    హైదరాబాదు: బెట్టింగ్‌ యాప్‌ వ్యవహారంలో యాంకర్‌ శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్‌ కేసులో తన మీద నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ను క్వాష్‌ చేయాలని శ్యామల తన పిటిషన్‌ లో పేర్కొన్నారు. అయితే, ఆ పిటిషన్‌ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. బెట్టింగ్‌ యాప్స్‌ ను ప్రమోట్‌ చేసినందుకు పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ లో శ్యామలపై కేసు నమోదైంది. ఆంధ్ర 365 అనే ఆన్‌ లైన్‌ గేమింగ్‌ యాప్‌ కు యాంకర్‌ శ్యామల ప్రమోషన్‌ చేశారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు