తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • పడిపోతున్న ఉల్లి ధరలు

    కర్నూలు:నిన్నమొన్నటి వరకు రైతన్నలను కాస్త ఆదుకున్న ఉల్లి నేడు కన్నీరు పెట్టిస్తోంది. అన్ని వ్యవసాయ ఉత్పత్తుల బాటలోనే రోజురోజుకూ ఉల్లి ధర పతనం అవుతోంది. అమాంతం పడిపోయిన ఉల్లి రేట్లతో భారీగా నష్టపోతున్నామని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో గత కొంతకాలంగా మిర్చి, కంది, వాము, వేరుశెనగ తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉల్లి పంటకు మొన్నటి వరకు స్థిరంగా గిట్టుబాటు ధర లభించింది. ఇదే ధరలు కొనసాగుతాయని

    READ MORE
  • చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు

    హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై యూనివర్సిటీలు, సంస్థలు ఉంటే పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దాన్ని పరిష్కరించేందుకే రాష్ట్రంలోని యూనివర్సిటీలు, సంస్థలకు తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నామని చెప్పారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్‌, తెలుగు వర్సిటీ పేరు మార్పు తదితర బిల్లులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం మాట్లాడారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు.

    READ MORE
  • ఎల్లాపూర్‌లో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం.. ముగ్గురు అరెస్ట్‌

    నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లాపూర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఎల్లాపూర్‌లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని  గుర్తుతెలియని వ్యక్తి ధ్వంసం చేశారు. ఆదివారం అర్ధరాత్రి వేల ముగ్గురు దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ముగ్గురు అనుమానితులను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబేద్కర్ విగ్రహ దాడిపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

    READ MORE
  • స్వాభిమానంతో మాతృభాషను కాపాడుకోవడమని పవన్‌కు ఎవరైనా చెప్పండి

    అమరావతి:కేంద్ర ప్రభుత్వం తమపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తుందంటూ తమిళనాడులో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతున్న వేళ జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. తరచూ పవన్ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా #justasking ట్యాగ్ తో సెటైర్లు, కౌంటర్ కామెంట్స్ చేసే ప్రకాశ్‌రాజ్ తాజాగా హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలకు స్పందించారు.  ‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో

    READ MORE
  • రెండు రోజుల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు

    హైదరాబాద్ : తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఆదిలాబాద్ జిల్లా బేలలో గరిష్ఠంగా 42 డిగ్రీలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణంగా కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నెల 21 నుంచి వర్షాలు కురుస్తాయని పేర్కొన్న సంగతి తెలిసిందే.

    READ MORE
  • చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు

    హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై యూనివర్సిటీలు, సంస్థలు ఉంటే పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దాన్ని పరిష్కరించేందుకే రాష్ట్రంలోని యూనివర్సిటీలు, సంస్థలకు తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నామని చెప్పారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్‌, తెలుగు వర్సిటీ పేరు మార్పు తదితర బిల్లులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం మాట్లాడారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు.

    READ MORE
  • తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత..బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్ట్

    హైదరాబాదు:తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఓయూలో నిరసనలు, ధర్నాలను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఆ క్రమంలో తమ డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించేందుకు కార్యకర్తలు అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు. అయితే, ముందుగా అంచనా వేసిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.  

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు