తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • నీకెందుకు సపోర్ట్‌ చేయాలి..

    అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయంటూ ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి పెద్దల నుంచి విశేష మద్దతు లభించింది. కానీ ఈ ధర్నాకు కాంగ్రెస్ నేతలు దూరంగా ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ నాయకులే సమాధానం చెప్పాలంటూ జగన్ ఇటీవల మీడియా ముందు వ్యాఖ్యానించారు. దానిపై స్పందించిన షర్మిల.. ఘాటుగా సమాధానమిచ్చారు. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలని

    READ MORE
  • ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ పై … రైతన్నల ఆగ్రహం

    మంగళగిరి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ పై ఉండవల్లిలోని సుందరయ్య చౌక్ వద్ద రైతు సంఘం నేతలు శనివారం నిరసన తెలిపారు. బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేతలు మాట్లాడుతూ కేంద్ర గవర్నమెంట్ పెట్టిన బడ్జెట్ రైతాంగాన్ని నడ్డి విరిచే విధంగా ఉన్నదన్నారు. రైతాంగానికి బడ్జెట్ 1,52,000 కోట్ల రూపాయలు తగ్గించారనీ, గతం కంటే దీని ప్రభావం వలన సాధారణ ప్రజానీకానికి కూడా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు

    READ MORE
  • అప్పులపై బాబు తప్పుదోవ పట్టిస్తున్నారు

    తాడేపల్లి: అప్పులపై సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శించారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. బాబు పాలనలో రాష్ట్రం తిరోమనంలో వెళ్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 52 రోజుల్లో రాష్ట్రంలో అక్రమాలు, ఆకృత్యాలు పెరిగిపోయాయన్నారు. “52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతోంది. ప్రశ్నించే వాళ్లను అణచివేస్తున్నారు. వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విధ్వంస పాలన సాగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. బడ్జెట్ కూడా

    READ MORE
  • బడ్జెట్ లో అన్యాయంపై సిపిఎం నిరసిన

    -విజయవాడ : కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో శుక్రవారం ధర్నా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర నిరాశ ఎదురైందని, బిజెపి డౌన్ డౌన్, 15 వేల కోట్లు అప్పుల రూపంలో కాకుండా గ్రాండ్ రూపంలో నిధులు కేటాయింపులు జరపాలని, విభజన హామీలను అమలు చేయాలని, బుందేల్ఖండ్ ప్యాకేజీని వెనుకబడిన ప్రాంతాలకు అమలు చేయాలని, కోరుతూ నాయకులు నినదించారు. సందర్భంగా సిపిఎం రాష్ట్ర

    READ MORE
  • పెద్దవాగుకు భారీ గండి

    కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అశ్వారావుపేట మండలంలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. సామర్థ్యానికి మించి నీరు రావడంతో ప్రాజెక్టు కట్టకు భారీ గండింది. గురువారం రాత్రంతా రాత్రంతా నీరు దిగువకు వెళ్లడంతో ప్రాజెక్టు ఖాళీఅయింది. దీంతో దిగువన అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి, కోయరంగాపురం, కొత్తూరు, రమణక్కపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం జరగ్గా ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, కోయమాదారం, కొత్తపూచిరాల, పాతపూచిరాల, అల్లూరినగర్, సొందిగొల్లగూడెం, వసంతవాడ,

    READ MORE
  • జూరాలకు కొనసాగుతున్న వరద

    మహబూబ్నగర్: ఎగువన సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 20 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి దిగువకు 27,877 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318.516 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 315.850 అడుగులు ఉంది. జలాశయం నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.951 టీఎంసీలుగా ఉందని అధికారులు

    READ MORE
  • తెలంగాణకు రెడ్ అలెర్ట్

    హైదరాబాదు:తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీచేసింది. నేడు ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. కుమ్రం భీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు  ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, జయశంకర్-భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. మరో ఐదారు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు