తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    బెంగళూరు:వైసీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఇక్కడి విమానాశ్రయంలో  ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయను అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. ఆయనను తదుపరి విచారణ నిమిత్తం విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన

    READ MORE
  • మహిళను చెట్టుకు కట్టేసి

    కుప్పం:  నియోజకవర్గంలో  అప్పు తీర్చలేదని ఓ మహిళను పట్టపగలు నిర్దాక్షిణ్యంగా చెట్టుకు కట్టేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. అందుకు సంబంధించి వీడియోలు సైతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. మహిళపై దాడి చేసిన వారిపై వెంటనే అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సీఎం ఎస్పీతో మాట్లాడగా.. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటను

    READ MORE
  • వ్యాను బీభత్సం.. దంపతులు మృతి

    నెల్లూరు: దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం గ్రామంలో సోమవారం వేగంగా వెళ్తున్న వ్యాను అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఒక దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో  దుకాణంలో ఉన్న వెంకటేశ్వర్లు, ఆయన భార్య స్వర్ణలత అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృత దేహాలను  పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.  

    READ MORE
  • షార్‌కు బాంబు బెదిరింపులు.

    న్యూ ఢిల్లీ: శ్రీ‌హ‌రికోట‌ లోని భార‌త అంత‌రిక్ష ప్ర‌యోగ‌ కేంద్రం-షార్‌కు బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. ఆదివారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత త‌మిళ‌నాడు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌కు ఓ ఫోన్ కాల్ వ‌చ్చింది. ఫోన్ చేసిన వ్య‌క్తులు షార్‌లో బాంబు ఉన్న‌ట్లు బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు షార్ ప‌రిస‌రాల్లో త‌నిఖీలు చేప‌ట్టారు. బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా త‌నిఖీ చేస్తున్నారు. ఈ త‌నిఖీల్లో ఎలాంటి పేలుడు ప‌దార్థాలూ, అనుమానాస్ప‌ద వ‌స్తువులూ ల‌భించ‌లేదు. మ‌రోవైపు

    READ MORE
  • కొమ్మినేనికి సుప్రీంకోర్టులో ఊరట

    అమరావతి:సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సాక్షి ఛానల్‌లో అమరావతి మహిళలను కించపరిచేలా చర్చా కార్యక్రమం నిర్వహించి, అనుచిత ప్రశ్నలు వేశారన్న ఆరోపణలపై అరెస్టయిన ఆయనను తక్షణమే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.  భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం చేయవద్దని ధర్మాసనం హెచ్చరించింది. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. కొమ్మినేనిని

    READ MORE
  • వాస్తవాలను వెల్లడించడం కేసీఆర్ బాధ్యత

    హైదరాబాదు:లక్షల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణను ఎదుర్కోవడంలో ఎలాంటి తప్పులేదని తెలంగాణ జనసమితి (టి.జె.ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రజా సొమ్ము ఖర్చు చేసినప్పుడు, కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వడం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరు కావడంపై కొందరు రాద్ధాంతం చేయడం సమంజసం కాదని ఆయన విమర్శించారు.”తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందే.

    READ MORE
  • మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్ కలకలం

    హైదరాబాదు:ప్రముఖ జానపద గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదంగా మారాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‌లో అర్ధరాత్రి జరిగిన ఈ వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం జరిగిందన్న ఆరోపణలు, అధికారిక అనుమతులు లేకపోవడం, అక్రమంగా సౌండ్ సిస్టమ్స్ వాడటం వంటి పలు ఉల్లంఘనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో పలువురు సినీ ప్రముఖులు కూడా పోలీసుల నిఘాలోకి వచ్చినట్లు తెలుస్తోంది.చేవెళ్ల ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భూపాల్ శ్రీధర్ వెల్లడించిన

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు