హొసూరు : ఇక్కడి పెరియార్ నగర్లోని బాల మురుగన్ దేవాలయంలో తై మాస పూజలను అతి వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగా ఆలయంలో మూల విరాట్టుకు వివిధ రకాల అభిషేకాలు నిర్వహించిన తర్వాత స్వామి వారిని అనేక రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. చివరగా స్వామి వారికి కర్పూర హారతినిచ్చి,
తీర్థ ప్రసాదాలను వినియోగం చేశారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి బాల మురుగన్కు విశేష పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు