తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • అప్పులపై బాబు తప్పుదోవ పట్టిస్తున్నారు

    తాడేపల్లి: అప్పులపై సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శించారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. బాబు పాలనలో రాష్ట్రం తిరోమనంలో వెళ్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 52 రోజుల్లో రాష్ట్రంలో అక్రమాలు, ఆకృత్యాలు పెరిగిపోయాయన్నారు. “52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతోంది. ప్రశ్నించే వాళ్లను అణచివేస్తున్నారు. వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విధ్వంస పాలన సాగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. బడ్జెట్ కూడా

    READ MORE
  • బడ్జెట్ లో అన్యాయంపై సిపిఎం నిరసిన

    -విజయవాడ : కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో శుక్రవారం ధర్నా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర నిరాశ ఎదురైందని, బిజెపి డౌన్ డౌన్, 15 వేల కోట్లు అప్పుల రూపంలో కాకుండా గ్రాండ్ రూపంలో నిధులు కేటాయింపులు జరపాలని, విభజన హామీలను అమలు చేయాలని, బుందేల్ఖండ్ ప్యాకేజీని వెనుకబడిన ప్రాంతాలకు అమలు చేయాలని, కోరుతూ నాయకులు నినదించారు. సందర్భంగా సిపిఎం రాష్ట్ర

    READ MORE
  • ఢిల్లీలో జగన్‌కు అవమానం

    ఢిల్లీ: ఢిల్లీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దారుణ అవమానం జరిగింది. ఏపీలో హింస చెలరేగుతుందంటూ ఢిల్లీలో.. జగన్ మొక్కుబడి ధర్నా చేసి మమ అనిపించారు. ఆ తరువాత ప్రధాని మోదీ సహా ఇతర కేంద్ర మంత్రులను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. కానీ ఒక్కరు కూడా ఇవ్వలేదు. అంతా నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక.. ఎవరినీ కలవకుండా జగన్ విజయవాడ బాట పట్టారు. పోనీ దీక్షలో ఏమైనా సాధించారా? అంటే అది కూడా

    READ MORE
  • వాసుదేవరెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు

    అమరావతి: మద్యం కుంభకోణంలో నిందితుడు బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) గత ఎండీ, ఐఆర్టీఎస్ అధికారి డి. వాసుదేవరెడ్డి నెలన్నర రోజులుగా పరారీలో ఉన్నారు. ఇప్పటికే పలు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన కోసం సీఐడీ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వాసుదేవరెడ్డి విదేశాలకు వెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అజ్ఞాతంలో ఉన్న ఆయన మరోవైపు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తన న్యాయవాదులతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అభియోగాలు

    READ MORE
  • సెల్ఫీ అడిగిన పారిశుద్ధ్య కార్మికులను దూరంగా నిల్చోవాలన్న రోజా

    తిరుచెందూర్: తనను సెల్ఫీ అడిగిన పారిశుద్ధ్య కార్మికులను దగ్గరకు రావొద్దన్న వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రమణియస్వామి ఆలయంలో సోమవారం నిర్వహించిన వరుషాభిషేకంలో రోజా, ఆమె భర్త సెల్వమణి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారితో సెల్ఫీలు దిగేందుకు భక్తుల్లో చాలామంది ఆసక్తి కనబరిచారు. అదే సమయంలో అక్కడున్న పారిశుద్ధ్య కార్మికులు సెల్ఫీ కోసం రోజా వద్దకు వెళ్లగా దూరంగా నిల్చోవాలని చేయి చూపిస్తూ రోజా చెప్పడం

    READ MORE
  • రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ ఉండాలి

    హైదరాబాదు : ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. తెల్ల రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింక్ పెట్టొద్దని అధికారులకు సూచించారు. అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీనిపై విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు అందేలా చర్యలు

    READ MORE
  • కమిషన్ చైర్మన్ ను మార్చేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన బెంచ్

    న్యూ ఢిల్లీ: తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై కాంగ్రెస్ సర్కారు నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. విచారణ పూర్తికాకముందే కమిషన్ ఓ నిర్ణయానికి వచ్చిందని ఆక్షేపించింది. ఈమేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తొలుత హైకోర్టులో పిటిషన్

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు