రోజాను అడ్డగించిన ఎస్ బీఐ పురం గ్రామస్థులు

రోజాను అడ్డగించిన ఎస్ బీఐ పురం గ్రామస్థులు

చిత్తూరు:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతూ తమ పార్టీకే ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి మంత్రి రోజా పుత్తూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎస్ బీఐ పురంలో ప్రచారానికి వెళ్లగా.. స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు మంత్రిని అడ్డగించారు. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. మంత్రికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ రోజాను ముందుకు వెళ్లనీయలేదు. సర్దిచెప్పేందుకు చూసినా వారు వినిపించుకోకపోవడంతో చేసేదేంలేక మంత్రి రోజా వెనుదిరిగారు. ప్రచారం చేయకుండానే వచ్చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos