విజయవాడ: ప్రొఫెషనల్ ఆటకు , రాజకీయాలకు సంబంధం ఉండకూడదు కాబట్టే నేను వైసీపీకి గుడ్ బై చెప్పినట్లు క్రికెటర్ అంబటి రాయుడు పేర్కొన్నారు. వైసీపీలో చేరిన పది రోజులకే పార్టీని విడడంతో వైసీపీ మీద ఇతర పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వైసీపీ లో చేరిన వారం రోజులకే పార్టీ నుంచి బయటకు వెళ్లారు క్రికెటర్ అంబటి రాయుడు. ఈ క్రమంలో పార్టీ నుంచి బయటకు వెళ్లిన తరువాత అంబటి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ” నేను అంబటి రాయుడిని..జనవరి 20 నుంచి దుబాయ్ వేదికగా జరిగే ఐఎల్టీ 20 లో ముంబై ఇండియన్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.ప్రొఫెషనల్ ఆటలో ఆడేందుకు నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ ఉండకూడదు” అని పేర్కొన్నారు. కొన్నాళ్లు పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.