మతం పేరుతో ఓట్లు అడిగిన బిజెపి ఎంపీపై కేసు

మతం పేరుతో ఓట్లు అడిగిన బిజెపి ఎంపీపై కేసు

బెంగళూరు : మతం పేరుతో ఓట్లు అడిగినందుకు బెంగళూరు సౌత్ బిజెపి అభ్యర్థి, ఎంపి తేజస్వీ సూర్యపై కేసు నమోదైంది. మతం పేరుతో ఓట్లు అడుగుతూ సోషల్ మీడియాలో తేజస్వి సూర్య ఒక వీడియోను పోస్ట్ చేసినట్లు కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. దీంతో, బెంగళూరులోని జయనగర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. లోక్సభ ఎన్నికల రెండో దశలో భాగంగా బెంగళూరు సౌత్కు గురువారం ఎన్నికలు జరిగాయి. బిజెపి నుంచి తేజస్వి సూర్య పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి సౌమ్యారెడ్డి పోటీలో ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos