మంచివాళ్ల కోసమే నేను ప్రచారం చేస్తున్నా

మంచివాళ్ల కోసమే నేను ప్రచారం చేస్తున్నా

చెన్నై: దేశం బాగుపడాలంటే, మతతత్త్వ శక్తులను పారద్రోలాలంటే, మంచివారికి అండగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని, అందుకే తాను రాష్ట్రంలో ఇండియా కూటమి విజయం కోసం ప్రచారం చేస్తున్నానని మక్కల్ నీదిమయ్యం నాయకుడు కమల్హాసన్అన్నారు. మదురైలో ఇండియా కూటమి తరఫున పోటీచేస్తున్న సీపీఎం అభ్యర్థి వెంకటేశన్కు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ పర్యటనలో మక్కల్ నీదిమయ్యం కార్యకర్తలు, సీపీఎం, సీపీఐ, డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీల జెండాలు పట్టుకుని కమల్కు జేజేలు పలికారు. విమానాశ్రయం నుంచి ప్రచార ప్రాంతం వరకు కమల్హాసన్ నడిచి వెళ్లారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos