ప్రజ్వల్ పెన్‌డ్రైవ్‌లో 3 వేల మంది మహిళల సెక్స్ వీడియోలు

ప్రజ్వల్ పెన్‌డ్రైవ్‌లో 3 వేల మంది మహిళల సెక్స్ వీడియోలు

బెంగళూరు : మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన పెన్డ్రైవ్లో ప్రభుత్వ అధికారులు సహా దాదాపు 3 వేల మంది మహిళల సెక్స్ వీడియోలు ఉండడం, ఆ వీడియోలు బయటకు రావడం సంచలనమైంది. తన అరాచకాలు బయటపడిన వెంటనే ప్రజ్వల్ జర్మనీ పారిపోయారు. తాజాగా, ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బీజేపీ పెద్దలకు ముందే తెలుసన్న విషయం బయటపడింది.
గతేడాది సెప్టెంబర్లో ఎన్డీయేలో చేరిక
ప్రజ్వల్ పెన్డ్రైవ్లో ప్రభుత్వాధికారులు సహా మూడువేల మంది మహిళల అశ్లీల వీడియోలు ఉన్నాయంటూ బీజేపీ నేత ఒకరు గతేడాది డిసెంబరులోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి లేఖ రాశారు. కర్ణాటకలో ఈ నెల 26 తొలి దశ ఎన్నికలు జరగ్గా, అంతకు రెండు రోజుల ముందు ఈ వీడియోలు సోషల్ మీడియాకెక్కి వైరల్ అయ్యాయి. గతేడాది సెప్టెంబర్లో ఎన్డీయే కూటమిలో జేడీఎస్ చేరింది. 33 ఏళ్ల రేవణ్ణ హసన్ లోక్సభ స్థానం నుంచి ఎన్డీయే అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
ప్రజ్వల్ అరాచకాలపై బీజేపీ అధిష్ఠానం దృష్టికి
గతేడాది డిసెంబర్ 8న బీజేపీ నేత దేవరాజె గౌడ.. రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రకు లేఖ రాస్తూ ప్రజ్వల్ సహా దేవెగౌడ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజ్వల్ పెన్డ్రైవ్లో ప్రభుత్వ ఉద్యోగులు సహా 2,976 మంది మహిళల అశ్లీల వీడియోలు ఉన్నట్టు తెలిపారు. వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ లైంగిక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. మరో పెన్డ్రైవ్లో మహిళల అశ్లీల చిత్రాలు ఉన్నాయని, అవి ఇప్పటికే కాంగ్రెస్లోని జాతీయ స్థాయి నేతలకు చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. జేడీఎస్తో పొత్తుపెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో హసన్ నుంచి జేడీఎస్ అభ్యర్థిని బరిలో నిలిపితే ఆ వీడియోలు, ఫొటోలను కాంగ్రెస్ ‘బ్రహ్మాస్త్రం’లా ఉపయోగించుకుంటుందని, బీజేపీని రేపిస్ట్ పార్టీగా అభివర్ణిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే జరిగితే జాతీయ స్థాయిలో మన పార్టీకి అప్రతిష్ఠ తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు.
జర్మనీ చెక్కేసిన ప్రజ్వల్
ప్రజ్వల్ వీడియోలు వైరల్ కావడంతో జేడీఎస్ ఎమ్మెల్యే శరణగౌడ్ తీవ్రంగా స్పందించారు. ప్రజ్వల్ను పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ పార్టీ చీఫ్ హెచ్డీ దేవెగౌడకు లేఖ రాశారు. కాగా, వీడియోలు బయటకు రావడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా రేవణ్ణ విదేశాలకు చెక్కేశారు. నిన్న బెంగళూరులో విమానమెక్కి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ చెక్కేసినట్టు చెప్తున్నారు.
రేవణ్ణే కాదు.. ఆయన తండ్రి కూడా
మరోవైపు, ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాత రేవణ్ణ ఇంటిలో పనిచేసే 47 ఏళ్ల మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. రేవణ్ణతోపాటు ఆయన తండ్రి, హోలెనరసిపుర ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ తనను లైంగికంగా హింసించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ‘‘నేను చేరిన నాలుగు నెలల తర్వాత రేవణ్ణ ఫోన్ చేసి తన గదికి రమ్మని పిలుస్తూనే ఉన్నాడు. ఇంట్లో ఆరుగురు మహిళలు పనిచేస్తున్నారు. తాము ఇక్కడికి రావడంతోనే భయపడిపోయామని వారు చెప్పారు. ఇంట్లోని పురుష పనివారు కూడా జాగ్రత్తగా ఉండాలని మహిళలను హెచ్చరించేవారు’’ అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన (రేవణ్ణ) భార్య ఇంట్లో లేనప్పుడు తమను స్టోర్ రూముకు పిలిచి తమకు పండ్లు ఇస్తూ అసభ్యంగా తాకేవాడని ఆమె పేర్కొంది. చీర పిన్లు తొలగించి లైంగిక దాడికి పాల్పడేవాడని తెలిపారు. ప్రజ్వల్ తన కుమార్తెతోనూ అలాగే ప్రవర్తించే ప్రయత్నం చేస్తే, అతడి నంబరును బ్లాక్ చేసిందని పేర్కొన్నారు.
దర్యాప్తు కోసం నాలుగు బృందాలు
ప్రజ్వల్ సెక్స్ స్కాండల్ దుమారం రేపుతుండడంతో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. ప్రజ్వల్ పూర్వాపరాలు తెలిసినప్పటికీ, బీజేపీ కార్యకర్తలు లేఖలు రాసినప్పటికీ, ఆయన బాధితులు వేలల్లో ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం ఆయనకు టికెట్ ఇచ్చిందని మండిపడ్డారు. శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది సోమవారం ఎక్స్లో ప్రజ్వల్పై విరుచుకుపడ్డారు. ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జర్మనీ నుంచి ఆయనను వెనక్కి రప్పించి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ, కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, అమిత్ షా మౌనంగా ఉండడం తనను షాక్కు గురిచేసిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos