తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • గ్రేటర్‌ ఎన్నికలు…భాజపా బంపర్‌ ఆఫర్

    హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వరద బాధితులకు ఇంటికి రూ. 20 వేలు ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వరద నష్టం ఎంత వస్తే అంత లెక్క కట్టి ఇస్తామని చెప్పారు. నష్టపోయిన కార్లు, బైక్‌లు ఇప్పిస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. కాగా జనసేనతో పొత్తుకు సంబంధించి బీజేపీలో చర్చకు రాలేదని బండి వెల్లడించారు. పొత్తులపై

    READ MORE
  • వరవరరావుకు ఆసుపత్రిలో చికిత్స

    ముంబై : విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు(80)కు ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు ముంబై హై కోర్టు బుధ వారం అనుమ తించింది. 15 రోజులపాటు నానావతి ఆస్పత్రిలో చికిత్స అందించనున్నారు. ఆయన్ను వరవర రావును కుటుంబ సభ్యులు అక్కడ కలుసుకోవచ్చు. ఎల్గార్ పరిషత్ కేసులో ఏ విధమైన విచారణ లేకుండా చెరసాల్లో బంధీగా వరవర రావు ఆరోగ్యం బావుందని, మానసికంగా కూడా పూర్తి స్పృహలో ఉన్నారని హైకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళ వారం వివరణ

    READ MORE
  • దుబ్బాక ఎమ్మెల్యే నా జీవితంతో ఆడుకున్నాడు..

    దుబ్బాక నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తన జీవితాన్ని నాశనం చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపుతోంది.రఘునందన్ తో పాటు పలువురు తనను వేధింపులకు గురి చేస్తున్నారని రాధా రమణి అనే మహిళ సంచలన ఆరోపణలు చేస్తూ పలురకాల ట్యాబెట్లు మింగి ఆత్మహత్యకు యత్నించారు. అత్యాచారం కేసులో తనకు న్యాయం చెయ్యడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు