వరవరరావుకు ఆసుపత్రిలో చికిత్స

వరవరరావుకు ఆసుపత్రిలో చికిత్స

ముంబై : విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు(80)కు ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు ముంబై హై కోర్టు బుధ వారం అనుమ తించింది. 15 రోజులపాటు నానావతి ఆస్పత్రిలో చికిత్స అందించనున్నారు. ఆయన్ను వరవర రావును కుటుంబ సభ్యులు అక్కడ కలుసుకోవచ్చు. ఎల్గార్ పరిషత్ కేసులో ఏ విధమైన విచారణ లేకుండా చెరసాల్లో బంధీగా వరవర రావు ఆరోగ్యం బావుందని, మానసికంగా కూడా పూర్తి స్పృహలో ఉన్నారని హైకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళ వారం వివరణ ఇచ్చింది. అయితే ఆయనకు న్యూరలాజికల్, మూత్ర నాళాల సమస్యలు న్నాయని న్యాయవాది ఇందిరా జైసింగ్ తెలిపారు. అన్ని వైద్య పరీక్షలను నిర్వహించి, సమగ్ర వైద్య నివేదికను అందించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos