గ్రేటర్‌ ఎన్నికలు…భాజపా బంపర్‌ ఆఫర్

గ్రేటర్‌ ఎన్నికలు…భాజపా బంపర్‌ ఆఫర్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వరద బాధితులకు ఇంటికి రూ. 20 వేలు ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వరద నష్టం ఎంత వస్తే అంత లెక్క కట్టి ఇస్తామని చెప్పారు. నష్టపోయిన కార్లు, బైక్‌లు ఇప్పిస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. కాగా జనసేనతో పొత్తుకు సంబంధించి బీజేపీలో చర్చకు రాలేదని బండి వెల్లడించారు. పొత్తులపై జనసేన నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదనలు రాలేదన్నారు. గ్రేటర్‌లో ఒంటరిగా పోటీ చేయడానినికి ఏర్పాట్లు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. తనకు, పవన్ కళ్యాణ్‌కు మధ్యవర్తులు అవసరం లేదన్నారు. ‘నేను పవన్‌కు.. పవన్ కల్యాణ్‌కు నేను చాలా దగ్గరని, ఏ విషయం ఉన్నా ఫోన్లో మట్లాడుకుంటూ ఉంటాం.. ఏపీలో మత మార్పిడిలను వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, పొత్తుల అంశం మాట్లాడటానికి నేను పవన్ కళ్యాణ్‌ను కలవటం లేదని’ బండి సంజయ్ చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos