తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • బాలయ్య విరాళం

    అమరావతి : కరోనా నివారణ చర్యల్ని చేపట్టేందుకు సినీ నటుడు, శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ రూ.1 కోటి 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.50 లక్షల వంతున, తెలుగు సినీ కార్మికుల సహాయార్థం రూ. 25 లక్షలు వంతున విరాళాన్ని ఇచ్చారు.

    READ MORE
  • బంగార్రాజులో లావణ్య త్రిపాఠి

    హైదరాబాదు : లావణ్య త్రిపాఠి -బంగార్రాజు సినిమాలోనూ నటించనుంది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో యువ నాగార్జున సరసన లావణ్య త్రిపాఠి అలరించింది. ఆ సినిమాకి సీక్వెల్ గానే ‘బంగార్రాజు’ రూపొందుతోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ బ్యానర్లో నిర్మితమవుతోంది. కథానాయికగా లావణ్య త్రిపాఠిని తీసు కున్నారా? లేదంటే వేరే కీలకమైన పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారా? అనేది తెలియాల్సి వుంది.

    READ MORE
  • వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ

    హైదరాబాదు :వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో విజయదేవరకొండ ఒక సినిమాలో నటించనున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన -ఫైటర్ చిత్రీకరణ కరోనా వల్ల వాయిదా పడింది. దీని తరువాత విజయ్ దేవరకొండ నటించనున్న సినిమాకు ఆత్రేయ దర్శకుడు. బ్రోచేవారెవరురా సినిమాతో హిట్ కొట్టిన వివేక్ ఆత్రేయ, ఈ సారి మరో యూత్ ఫుల్ సబ్జెక్ట్ తో సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. ఇంతవరకూ విజయ్ దేవరకొండ చేసిన పాత్రలకి ఈ కథ పూర్తి భిన్నంగా

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు