తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • దక్షిణాది ఆత్మగౌరవంపై భాజపాకు అవగాహన  లేదు

    హైదరాబాదు: ‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు’ అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల

    READ MORE
  • జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం

    విజజవాడ: ఏపీలో 4 తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పోలఅఈసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

    READ MORE
  • రాజన్న రాజ్యమే లక్ష్యం

    హైదరాబాదు: ‘తెలంగాణలో రాజన్న లేని లోటు క్లియర్ గా కనిపిస్తోంది. ఆయన రాజ్యాన్ని మళ్లీ తీసుకురావడమే తమ లక్ష్యమ’ని వై ఎస్ షర్మిల తెలిపారు. మంగళవారం ఇక్కడ తన నివాసంలో విలేఖరులతో మాట్లాడారు. అనేక ప్రశ్నలకు ఆమె పొడిపొడిగానే సమాధానలు ఇచ్చారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. అందరూ కాస్త ఓపిక పట్టాలని… అన్ని విషయాలు చెపుతానన్నారు. అందరితో తాను మాట్లాడుతున్నానని చెప్పారు. కొత్త పార్టీ పేరు ఏమిటనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వలేదు. తర్వాత చెపుతానంటూ

    READ MORE
  • ఉక్కు కర్మాగారాన్ని కాపాడు కునేందుకు నిరసన

    విశాఖ : ఇక్కడి ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం అమ్మేయటాన్ని ఆక్షేపించి అఖిలపక్ష కార్మిక సంఘాల నేతృత్వంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కూర్మన్నపాలెం కూడలి నుంచి విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. సుమారు వెయ్యి మందికి పైగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ లో 100 శాతం వాటాలను అమ్మేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. స్టీల్ ప్లాంట్తోపాటు ఇతర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలనే

    READ MORE
  • కొత్త దర్శకుడితో రాజశేఖర్ కొత్త సినిమా

    హైదరాబాదు: డా.రాజశేఖర్ మలయాళంలో హిట్టయిన జోసెఫ్ సినిమా తెలుగు రీమేక్ లో నటించనున్నారు. లలిత్ అనే కొత్త దర్శకుడు దీన్ని రూపొందించనున్నారు. తెలుగు వాతావారణానికి తగ్గట్టుగా మూలకథకు మార్పులు చేర్పులు చేశారు. క్రైమ్ థ్రిల్లర్ ఇతి వృత్తం. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే చిత్రీకరణ ఆరంభం కానుంది.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు