రాజన్న రాజ్యమే లక్ష్యం

రాజన్న రాజ్యమే లక్ష్యం

హైదరాబాదు: ‘తెలంగాణలో రాజన్న లేని లోటు క్లియర్ గా కనిపిస్తోంది. ఆయన రాజ్యాన్ని మళ్లీ తీసుకురావడమే తమ లక్ష్యమ’ని వై ఎస్ షర్మిల తెలిపారు. మంగళవారం ఇక్కడ తన నివాసంలో విలేఖరులతో మాట్లాడారు. అనేక ప్రశ్నలకు ఆమె పొడిపొడిగానే సమాధానలు ఇచ్చారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. అందరూ కాస్త ఓపిక పట్టాలని… అన్ని విషయాలు చెపుతానన్నారు. అందరితో తాను మాట్లాడుతున్నానని చెప్పారు. కొత్త పార్టీ పేరు ఏమిటనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వలేదు. తర్వాత చెపుతానంటూ ముందుకు సాగారు. క్షేత్ర స్థాయి వాస్తవాల్ని తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నానని వివరించారు. తెలంగాణలో ప్రతి ఇంటికి వెళ్తానని చెప్పారు. మరోవైపు కొత్త పార్టీపై కార్యకర్తలకు ఆమె దిశానిర్దేశం చేయబోతున్నారు. రానున్న 30 రోజులు పార్టీ నిర్మాణంపై దృష్టిని సారించనున్నట్టు తెలుస్తోంది. పార్టీ ప్రకటన కోసం భారీ బహిరంగసభను నిర్వహించే అవకాశం ఉంది. వైయస్సార్, తెలంగాణ పేర్లు కలిసి వచ్చేలా పార్టీ పేరు ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. 100 నియోజకవర్గాల్లో 16 నెలల పాటు పాదయాత్ర చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos