తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వివేకా హత్య కేసు… సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

    న్యూ ఢిల్లీ:రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐ మరింత సమయం కోరడంతో, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.వివేకా హత్య కేసులో కుట్ర కోణంపై తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే విషయంపై స్పష్టత

    READ MORE
  • ప్రియుడి మోజులో భర్తను చంపించిన భార్య

    కర్నూలు :వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం, పద్మావతి దంపతులు. అయితే, కొంతకాలంగా పద్మావతికి చెన్నబసవ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన

    READ MORE
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

    విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం వద్ద కోకింగ్‌ కోల్‌లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది అదుపు చేస్తున్నారు. పెద్ద పెద్ద కుప్పలుగా కోకింగ్‌ కోల్‌ ఉండటంతో ఎండ వేడికి మంటలు చెలరేగుతున్నాయి.

    READ MORE
  • పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అమరావతి:దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో

    READ MORE
  • తెలంగాణ సంక్షేమ పథకాలకు ప్రశంసలు

    హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే. సింగ్‌ కితాబునిచ్చారు. జూబిలీ హాలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మిషన్‌ భగీరథ పథకాన్ని అభినందిస్తూ, ప్రభుత్వం పెట్టుబడి వ్యయం పెంచుకుంటూ పోవడం శుభ పరిణామమన్నారు. సొంత పన్నుల రాబడిలో వృద్ధి రేటు బాగుందన్నారు.

    READ MORE
  • తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

    హైదరాబాదు:ఇక్కడి రాజ్‌భవన్‌లో మంగళవారం ఉదయం తెలంగాణ ప్రభుత్వ మంత్రి వర్గ విస్తరణ వైభవంగా జరిగింది. పది మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. తొలుత ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత వరుసగా తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్‌రెడ్డి, ఈటెల రాజేందర్, నిరంజన్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, విధాన పరిషత్తు

    READ MORE
  • ఖమ్మం సీటుపై కాంగ్రెస్‌, టీడీపీ సిగపట్లు

    ఖమ్మం లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్‌, టీడీపీలు పట్టుదలతో వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఈ స్థానాన్ని తమ పార్టీకే కేటాయించాలని డిమాండ్‌ చేస్తుంటే, టీడీపీకి ఇవ్వాలని ఆ పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పట్టుబడుతున్నారు. మరో వైపు ఈ ఇద్దరు నాయకులు జిల్లాలో తమ పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఏదేమైనా ఈసారి కూడా మహా కూటమితోనే ముందుకు వెళ్లాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు నామా వద్ద అభిప్రాయపడ్డారు. మహా కూటమిగా ఉంటేనే

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు