ఖమ్మం లోక్సభ స్థానంపై కాంగ్రెస్, టీడీపీలు పట్టుదలతో వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్కు చెందిన మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఈ స్థానాన్ని తమ పార్టీకే కేటాయించాలని డిమాండ్ చేస్తుంటే, టీడీపీకి ఇవ్వాలని ఆ పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పట్టుబడుతున్నారు. మరో వైపు ఈ ఇద్దరు నాయకులు జిల్లాలో తమ పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఏదేమైనా ఈసారి కూడా మహా కూటమితోనే ముందుకు వెళ్లాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు నామా వద్ద అభిప్రాయపడ్డారు. మహా కూటమిగా ఉంటేనే కేసీఆర్ను కట్టడి చేయవచ్చని వారు సూచించారు. ఖమ్మం నుంచి మీరే పోటీ చేయాలని వారు నామాకు విజ్ఞప్తి చేయగా, అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందని ఆయన వారికి సమాధానమిచ్చారు. రేణుకా చౌదరికి ఖమ్మం స్థానాన్ని కేటాయించాలని కాంగ్రెస్ నాయకులు పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు.