భోపాల్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు

భోపాల్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు

న్యూ ఢిల్లీ : దేశంలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. సోమవారం ఉదయం రాజస్థాన్లోని జైపూర్ , మహారాష్ట్రలోని నాగ్పూర్ , గోవా విమానాశ్రయాలకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఎయిర్పోర్ట్కు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ విమానాశ్రయానికి ) గుర్తుతెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. దీంతో వెంటనే ఎయిర్పోర్ట్ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు బాంబ్ స్క్వాడ్, జాగిలాలతో తనిఖీలు చేపట్టినట్లు గాంధీ నగర్ పోలీసులు తెలిపారు. ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ విశాల్ కుమార్ శర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos