తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వివేకా హత్య కేసు… సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

    న్యూ ఢిల్లీ:రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐ మరింత సమయం కోరడంతో, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.వివేకా హత్య కేసులో కుట్ర కోణంపై తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే విషయంపై స్పష్టత

    READ MORE
  • ప్రియుడి మోజులో భర్తను చంపించిన భార్య

    కర్నూలు :వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం, పద్మావతి దంపతులు. అయితే, కొంతకాలంగా పద్మావతికి చెన్నబసవ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన

    READ MORE
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

    విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం వద్ద కోకింగ్‌ కోల్‌లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది అదుపు చేస్తున్నారు. పెద్ద పెద్ద కుప్పలుగా కోకింగ్‌ కోల్‌ ఉండటంతో ఎండ వేడికి మంటలు చెలరేగుతున్నాయి.

    READ MORE
  • పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అమరావతి:దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో

    READ MORE
  • సూటిగా సుత్తి లేకుండా…

    తెలంగాణ కాంగ్రెస్‌ లేడీ ఫైర్‌బ్రాండ్‌ విజయశాంతి సీఎం కేసీఆర్‌పై మరోసారి విమర్శనస్త్రాలు సంధించారు. మిగతా నేతల్లా ఏవేవో కాలం చెల్లిన,మూస విమర్శలు కాకుండా ప్రతీ ఒక్కరికీ సూటిగా అర్థమయ్యేలా విజయశాంతి విమర్శలు చేసారు.ఏదో ఒక ఆధారాన్ని చూపిస్తూ.. కేసీఆర్ ఇరుకున పడేలా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత 69 రోజులకు మంత్రివర్గాన్ని విస్తరించటం.. మంత్రివర్గంలో హరీశ్‌రావుకు చోటు దక్కకపోవటంపై విజయశాంతి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.టీఆర్

    READ MORE
  • రేపు మంత్రి వర్గ సమావేశం

    హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రగతి భవన్‌లో జరుగనుంది. శాసన సభలో త్వరలో ప్రవేశపెట్టనున్న ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. కొత్తగా పది మంది మంత్రి వర్గంలో చేరిన తర్వాత జరుగనున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా కొత్త మంత్రులకు సీఎం శాఖలను కేటాయించారు. ఈటల రాజేందర్‌- వైద్య, ఆరోగ్యం, వేముల ప్రశాంత్‌ రెడ్డి-

    READ MORE
  • చంద్రబాబు, మమతపై కిషన్ రెడ్డి ధ్వజం

    హైదరాబాద్‌ : పుల్వమాలో ఉగ్ర దాడిపై ఆంధ్ర, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీలు మాట్లాడుతున్న తీరు తోడు దొంగలను తలపిస్తోందని బీజేపీ సీనియర్‌ నాయకుడు కిషన్‌ రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు దాడి జరగడంపై అనుమానాలున్నాయంటూ మమతా బెనర్జీ చెప్పడం, దానికి చంద్రబాబు వత్తాసు పలకడం చూస్తుంటే … ప్రపంచానికి వీరు ఏ సంకేతం ఇవ్వదలచుకున్నారని ప్రశ్నించారు. వీరి మాటలు దేశ గౌరవానికి భంగం కలిగే విధంగా ఉన్నాయని విమర్శించారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు