చంద్రబాబు, మమతపై కిషన్ రెడ్డి ధ్వజం

చంద్రబాబు, మమతపై కిషన్ రెడ్డి ధ్వజం

హైదరాబాద్‌ : పుల్వమాలో ఉగ్ర దాడిపై ఆంధ్ర, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీలు మాట్లాడుతున్న తీరు తోడు దొంగలను తలపిస్తోందని బీజేపీ సీనియర్‌ నాయకుడు కిషన్‌ రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు దాడి జరగడంపై అనుమానాలున్నాయంటూ మమతా బెనర్జీ చెప్పడం, దానికి చంద్రబాబు వత్తాసు పలకడం చూస్తుంటే … ప్రపంచానికి వీరు ఏ సంకేతం ఇవ్వదలచుకున్నారని ప్రశ్నించారు. వీరి మాటలు దేశ గౌరవానికి భంగం కలిగే విధంగా ఉన్నాయని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos