ఊళ్లకు ఊళ్లే దోచేసిన రోజా

ఊళ్లకు ఊళ్లే దోచేసిన  రోజా

తిరుపతి: నగిరి నియోజకవర్గాన్ని దోచేసిన మంత్రి రోజా ను ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు సీపీఐ జాతీయ నేత నారాయణ పిలుపునిచ్చారు. గురు వారం తిరుపతిలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. నగిరిలో రోజా ఊళ్లకు ఊళ్లే దోచేసిందన్నారు. ఇష్టా రాజ్యంగా ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ రవాణాతో నగిరి నియోజకవర్గాన్ని పూర్తిగా దోచేసిందని అన్నారు. నగిరిలో మంత్రి రోజా పాలనలో దౌర్జన్యాలు, అరాచకాలు, అవినీతి ఎక్కువైందన్నారు. రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్టకు చేరాయన్నారు. ఇకపై నగిరి ప్రజలకు మంత్రి రోజాని భరించే శక్తి లేదన్నారు. పవిత్రంగా జరిగే గంగమ్మ జాతరలో చివరి రోజైన గంగమ్మను ఏ విధంగా అయితే ఊరి బయట వేస్తామో.. అదే విధంగా మంత్రి రోజాని ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని నగిరి ప్రజలను నారాయణ పిలుపునిచ్చారు.

తాజా సమాచారం