ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తాం

ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తాం

భువనగిరి:అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం చెప్పినట్లుగా మతపరమైన రాజకీయాకు తాము వ్యతిరేకమని, ముస్లింలకు రిజర్వేషన్లను తొలగించి… వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీకు ఇస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గురువారం భువనగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో డబుల్ డిజిట్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. అందుకే అబద్దాలు చెప్పి గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. తాము పదేళ్లుగా పూర్తి మెజార్టీలో ఉన్నా రిజర్వేషన్లు తీసివేయలేదని గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం వాటిని తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇస్తామని హామీ ఇచ్చారు.

తాజా సమాచారం