తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వివేకా హత్య కేసు… సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

    న్యూ ఢిల్లీ:రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐ మరింత సమయం కోరడంతో, తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.వివేకా హత్య కేసులో కుట్ర కోణంపై తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే విషయంపై స్పష్టత

    READ MORE
  • ప్రియుడి మోజులో భర్తను చంపించిన భార్య

    కర్నూలు :వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం, పద్మావతి దంపతులు. అయితే, కొంతకాలంగా పద్మావతికి చెన్నబసవ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన

    READ MORE
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

    విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం వద్ద కోకింగ్‌ కోల్‌లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది అదుపు చేస్తున్నారు. పెద్ద పెద్ద కుప్పలుగా కోకింగ్‌ కోల్‌ ఉండటంతో ఎండ వేడికి మంటలు చెలరేగుతున్నాయి.

    READ MORE
  • పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అమరావతి:దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో

    READ MORE
  • రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ వేసిన పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై తెలంగాణ బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అంతేకాకుండా, రాజకీయ పోరాటాలకు న్యాయస్థానాలను వేదికగా మార్చవద్దని బీజేపీకి గట్టిగా హితవు పలికింది. కేసును కొట్టివేసిన తర్వాత కూడా వాదనలు కొనసాగించే ప్రయత్నం చేసిన బీజేపీ తరఫు న్యాయవాదిపై ప్రధాన న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రూ.10 లక్షల జరిమానా విధిస్తామని గట్టిగా హెచ్చరించారు.గతేడాది జరిగిన 2024 లోక్‌సభ

    READ MORE
  • నెలాఖరు వరకు తెలుగు నాట విస్తారంగా వానలు

    హైదరాబాదు:ప్రస్తుతం ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు అందించింది. బంగాళాఖాతంలో ఈ నెల 13వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది క్రమంగా బలపడి పశ్చిమ-వాయవ్య దిశగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల వైపు కదిలే సూచనలు ఉన్నాయని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.మరోవైపు, రాబోయే

    READ MORE
  • లండన్ నుంచి రాగానే ఫామ్‌హౌస్‌కు

    హైదరాబాదు:మాజీ మంత్రి హరీశ్‌రావుపై కవిత చేసిన తీవ్ర ఆరోపణలు సృష్టించిన రాజకీయ ప్రకంపనల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. విదేశీ పర్యటనను ముగించుకుని ఈ ఉదయం నగరానికి చేరుకున్న హరీశ్‌రావు మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీ కోసం ఆయన నేరుగా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు బయలుదేరి వెళ్లారు. కవిత ఇటీవల హరీశ్‌రావుతో పాటు ఎంపీ సంతోష్‌రావుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో టచ్‌లో ఉన్నారని, కల్వకుంట్ల

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు