తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • 102 మందికి డయేరియా

    విజయవాడ: న్యూరాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసుల నమోదు కలకలం రేపుతున్నాయి. మొత్తం 102 మంది వ్యాధి బారిన పడగా, 48 మంది చికిత్స పొందుతున్నారు. 54 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. స్థానికంగా జరిగిన రెండు మరణాలు డయేరియా వల్లే సంభవించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తాగునీటి సరఫరాలో సమస్యలు లేవని చెబుతున్నా, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇంకా రంగు మారిన నీరే సరఫరా చేస్తున్నారు. నగరంలో డయేరియా తరచూ ప్రబలుతూనే ఉంటోంది. గతంలో మొగల్రాజపురంలో కలుషిత

    READ MORE
  • లోక్‌సభ ఎన్నికల వరకైనా ఉంటుందా?

    లోక్‌సభ ఎన్నికలకు ముందే తెలంగాణలో కాంగ్రెస్‌ ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఐదు మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలో చేరనున్నట్లు ప్రకటించగా తాజాగా మరో ఎమ్మెల్యే తెరాసలో చేరనున్నట్లు ప్రకటించాడు.ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై గెలిచిన ఉపేందర్‌రెడ్డి తెరాసలో చేరనున్నట్లు ప్రకటించాడు.దీంతో తెరాసలో చేరడానికి సిద్ధమైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్‌ శాసనమండళి పక్షం విషయంలో

    READ MORE
  • మల్కాజ్‌గిరిలో పైచేయి ఎవరిదో?

    తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటిన తెరాస త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా అదే జోరు కొనసాగించడానికి వ్యూహాలు సిద్ధం చేస్తోంది.ఎంపీ అభ్యర్థులపై ఆచితూచి వ్యవహరిస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్న కేసీఆర్‌ ఇప్పటికే ఆరు నియోజకవర్గాలకు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.మిగిలిన పది నియోజకవర్గాలకు కూడా అంతర్గతంగా చేయిస్తున్న సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడానికి కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు.ఇక శాసనసభ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లోనైనా

    READ MORE
  • ఆరు మందితో తొలి జాబితా..అభ్యర్థుల ఎంపికలో సర్వేలే కీలకం..

    జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పడానికి కసరత్తులు చేస్తున్న తెరాస అధినేత కేసీఆర్‌ ప్రస్తుతం దృష్టి మొత్తం లోక్‌సభ ఎన్నికలపై కేంద్రీకరించారు.తెలంగాణలోని 16 లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా నిర్దేశించుకున్న కేసీఆర్‌ అందుకు సంబంధించి కార్యాచరణ ముమ్మరం చేశారు.రాష్ట్రంలోని 16 ఎంపీ నియోజకవర్గాల్లో సర్వే చేపట్టిన కేసీఆర్‌ సర్వేల ఆధారంగా మొదట ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, జహిరాబాద్‌, మెదక్‌,భువనగిరి నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎంపీలు నగేశ్‌,కల్వకుంట్ల కవిత, వినోద్‌కుమార్‌,బీబీ పాటిల్‌,కొత్త

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు