తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ఆర్‌యు లో ర్యాగింగ్‌ కలకలం

    కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ కలకలం సృష్టించింది. బీటెక్‌లో మొదటి ఏడాది చేరిన విద్యార్థిపై మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులు పిడిగుద్దులతో దాడి చేయడంతోపాటు ర్యాగింగ్‌ చేశారు. ‘షర్ట్‌ బటన్‌ పెట్టుకొని తరగతికి వెళ్లు అని సీనియర్లు చెప్పగా.., సరే.. బటన్‌ పెట్టుకుంటాను లే’ అని సమాధానం ఇచ్చినందుకు మొదటి ఏడాది విద్యార్థిని వారంతా కలిసి నూతన వసతి గృహంలోని 136వ నంబర్‌ గదిలోకి తీసుకెళ్లి పిడిగుద్దులతో దాడి చేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థి తాలూకా

    READ MORE
  • ఇది జనసేన గూండాయిజం

    అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్‌లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్‌ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం

    READ MORE
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచన

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో

    READ MORE
  • యూరియా కోసం రైతుల భారీ క్యూ లైన్‌

    కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్‌ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్‌ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు

    READ MORE
  • సెక్రటేరియట్‌లో దొంగలు పడ్డారు..మంత్రి పేషీలో హార్డ్‌డిస్క్‌లు,కీలక ఫైళ్లు మాయం..

    తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్‌లో మరోసారి దొంగలు పడ్డారు.అత్యంత భద్రత వలయం ఉన్నా పకడ్బందీగా లోపలికి ప్రవేశించి ఓ మంత్రి కార్యాలయంలోని కంప్యూటర్లలో హార్డ్‌డిస్క్‌లు,కీలక ఫైళ్లు ఎత్తుకెళ్లారు.తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగిన సమయంలో జీఏడీ అధికారులు మంత్రుల కార్యాలయాలు తమ స్వాధీనంలోకి తీసుకొని మంత్రుల కార్యాలయాలకు సీలు వేశారు.ఈ క్రమంలో సదరు మంత్రి కార్యాలయానికి కూడా సీలు వేశారు.ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన రెండు నెలలకు సీఎం కేసీఆర్‌ చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో మంత్రిపదవి దక్కడంతో కొద్ది రోజుల

    READ MORE
  • ఫేస్‌బుక్‌లో రైతు నివేదన…కేసీఆర్ స్పందన

    హైదరాబాద్‌ : ఓ రైతు తాను ఎదుర్కొంటున్న భూ సమస్యను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు ఆ సమస్య పరిష్కారానికి సీఎం ఆదేశాలతో అధికార యంత్రాంగం హుటాహుటిన కదిలింది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లికి చెందిన రైతు శరత్‌ … తన ఏడెకరాల భూమిని వీఆర్వో కరుణాకర్‌ వేరేవారికి పట్టా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పదకొండు నెలలుగా ఈ సమస్య అలాగే ఉందని, తన వేదన సీఎం

    READ MORE
  • జీవన్‌ రెడ్డి కరీంనగర్ : శాసన మండలి ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వానికి చెంప పెట్టు వంటిదని కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయనిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ పట్టభద్రులు తనపై ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా వారి సమస్యలపై మండలిలో గళమెత్తుతానని అన్నారు. ఈ ఎన్నికల్లో తెరాస బలపరిచిన అభ్యర్థులకు కేవలం 17 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావుల్లో 83 శాతం మంది కేసీఆర్‌ను వ్యతిరేకించారని చెప్పారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు