74 లోక్‌సభ స్థానాలు భాజపా వశం: యోగి

74 లోక్‌సభ స్థానాలు భాజపా వశం: యోగి

లక్నో: పాకిస్తాన్‌ బాలాకోట్ ఉగ్ర వాదుల శిబిరాలపై వాయసేన జరిపిన మెరుపు దాడులే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను తిరిగి అధికార పీఠంపై కూర్చొబెడుతుందని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ట్వీట్‌ చేసారు. ఉత్తర ప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ 74 స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆయన అంచనా వేసారు ‘పాకిస్తాన్‌లో మెరుపు దాడులు జరపటం నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న చాలా గొప్ప నిర్ణయం. ఇదే  ఆయన్ను మళ్లీ ప్రధానిగా చేయటం ఖాయం’ అని విశ్వాసాన్ని వ్యక్తీకరించారు. బాలాకోట్ వైమానిక దాడులతో దేశంలో మోదీ ప్రతిష్ట, జనాదరణ అమాంతం పెరిగిపోయిందనీ  కర్నాటకలో తమ పార్టీ 22 లోక్‌ సభ స్థానాలు గెలుచు కుంటుందంటూ బి.ఎస్. యడ్యూరప్ప  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.‘జార్ఖండ్‌లోని మొత్తం 14 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుందంటూ’ జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించడం పైనా దుమారం రేగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos