గాయకుడి ట్విట్టర్ గళంపై వేటు

గాయకుడి ట్విట్టర్ గళంపై వేటు

న్యూఢిల్లీ :కేంద్ర ప్రభుత్వ వినతి మేరకు కెనడియన్-పంజాబీ గాయకుడు జాజీ బి ఖాతాతో సహా భారత్లోని నాలుగు ఖాతాలను ట్విటర్ బ్లాక్ చేసింది. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనను సమర్థించి తరచూ ట్వీట్ చేయడమే దీనికి కారణం. ఇలా ఖాతాల్ని బ్లాక్ చేయటం ఇదే మొదలు కాదు. గత ఫిబ్రవరిలో కారవాన్ పత్రికతో సహా 250 ఖాతాల్ని చేసారు. దీని సంపాదకులపై ఢిల్లీ పోలీసులుఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. దీన్ని ఖండించిన ఇతర పాత్రికేయులు, విపక్ష నాయకుల ఖాతాల్ని కూడా బ్లాక్ చేసారు. ట్విటర్ ఖాతాల్ని మన దేశంలోనే బ్లాక్ చేసారు . దరిమిలా ఇతర దేశాల వారికి అవి కనిపిస్తాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos