ఆర్థిక సంవత్సరంలో మార్పు లేదు

ఆర్థిక సంవత్సరంలో మార్పు లేదు

న్యూ ఢిల్లీ : కరోనా కారణంగా 2019-20 ఆర్థిక సంవత్సరాన్ని జూన్ 30 వరకూ పొడిగించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కేంద్రం మంగళవారం ఇక్కడ స్పష్టీకరించింది. ‘సామాజిక మాధ్యమాలు, కొన్ని సాధారణ మాధ్యమాల్లో వచ్చినట్లు ఆర్థిక సంవత్సరాన్ని పొడిగించ లేదు. మార్చి 30న ప్రభుత్వం జారీ చేసిన ఓ నోటిఫికేషన్ ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇండియన్ స్టాంప్ యాక్ట్ కు చేసిన సవరణలను తప్పుగా కోట్ చేశారు. ఆర్థిక సంవత్సరం పొడిగింపు ఆలోచనేమీ లేదు” అని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos