విద్యాసిన్హా అస్తమయం

విద్యాసిన్హా అస్తమయం

ముంబై: బాలీవుడ్ సీనియర్ నటి విద్యాసిన్హా(71) గురువారం ఇక్కడి ఒక ఆస్పత్రిలో అస్తమించారు. హృదయ, ఊపిరితిత్తుల వ్యాధితో బాధ పడు తున్న ఆమె కొంత కాలంగా వెంటిలేటర్పైనే ఉన్నారు. అనారోగ్యం వల్ల టీవీలో ప్రసారమైన కుల్ఫీ కుమార్ బజేవాలా షో నుంచి తప్పుకున్నారు. ఆరోగ్యం కుదుటపడిందని భావించి కొన్ని వారాల కిందట తిరిగి షోకు హాజరైనపుడు అస్వస్థతకు గురయ్యారు. 27 ఏళ్ల వయస్సులో బాలీవుడ్లో హీరోయిన్గా నట జీవితాన్ని ప్రారంభించి ఆమె అనతికాలంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటించిన చిత్రాల్లో చోటీసీ బాత్, రజనీ గంధ, పతి పత్ని ఔర్వో బాగా విజయ వంతమయ్యాయి. కుల్ఫీ కుమార్ బజేవాలా, కుబూల్ హై, కావ్యాంజలి, భాబీ వంటి పలు బుల్లితెర కార్యక్రమాలతోనూ ప్రేక్షకులను మెప్పించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos