గత ఏడాది విడుదలైన గీతగోవిందం చిత్రం రష్మిక మందన్న,విజయ్ దేవరకొండ హిట్పెయిర్గా గుర్తింపు తీసుకువచ్చింది.కొద్ది రోజుల క్రితం విడుదలైన డియర్ కామ్రేడ్ చిత్రంపై కూడా విడుదలకు ముందు విపరీతమైన క్రేజ్ ఏర్పడడానికి ఈ హిట్పెయిరే కారణం.చిత్రం ఫలితం ఎలా ఉన్నా ఈ ఇద్దరి జంటకు క్రేజ్ మాత్రం తగ్గలేదనే విషయం తాజాగా మరోసారి రుజువైంది.త్వరలో పట్టాలకెక్కనున్న విజయ్,పూరి చిత్రంలో మరోసారి విజయ్కు జోడీగా రష్మిక నటించనున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో ముగ్గరు కథనాయికలు ఉంటారని, అందులో రష్మిక ఒకరని సినీ వర్గాల టాక్.కాగా అగ్రహీరోలకు జోడీగా క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న రష్మిక ఈ చిత్రానికి డేట్లు కేటాయించలేని పరిస్థితిలో ఉందని అయినప్పటికీ ఎలాగైనా రష్మిక తన సినిమాలోకి తీసుకోవాలని పూరి భావిస్తున్నారు.ఇక పూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్ ప్రకటించగానే ట్రేడ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది..