రెండు విడతల్లో వేతనాలు

రెండు విడతల్లో వేతనాలు

అమరావతి : ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం రెండు విడతల్లో చెల్లించనుంది. మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి తో భేటీ అయిన తర్వాత రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ విషయాన్ని విలేఖరులకు తెలిపారు. ‘కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నందున ఈ నెలలో సగం వేతనాన్ని చెల్లిస్తాం. నిధులు సర్దుబాటు అయ్యాక మిగతా సగాన్ని చెల్లిస్తామని సీఎం చెప్పారు. ఈ ఆపత్కాల పరిస్థితిలో రెండు విడతలుగా జీతం తీసుకునేందుకు ఒప్పుకున్నాం. ఈ ఒక్క నెల మాత్రమే రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం చెప్పార’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos