న్యూ ఢిల్లీ: కరోనా వల్ల వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలైనా చైనా, భారత్లకు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే ప్రమాదం లేదని ఐక్యరాజ్యసమితి వాణిజ్య నివేదిక అంచనా వేసింది. ఈ ఏడాది సంభవించనున్న ఆర్థిక మాంద్యం నుంచి ప్రపంచ దేశాలను ఆదుకునేందుకు 2.5 ట్రిలియన్ డాలర్ల వ్యయమయ్యే పథకాన్ని అమలు చేయాలి. సరముంటుందని పేర్కొంది. వస్తువుల ఎగుమతులపై ఆధారపడి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు మళ్లీ నిలదొక్కుకునేందుకు రెండేళ్లలో రెండు నుంచి మూడు ట్రిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు అవసరమవుతాయని లెక్కగట్టింది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోనున్నందున దేశాలు మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందని వివరించింది.