ప్రాథమికోన్నత పాఠశాలలకు శాశ్వత సెలవు!

ప్రాథమికోన్నత పాఠశాలలకు శాశ్వత సెలవు!

తెలంగాణలో ప్రాథమికోన్నత పాఠశాలలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.ఉన్నత పాఠశాలల సంఖ్య అధికంగా ఉండడంతో ప్రాథమికోన్నత పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల క్రమంగా తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను మాత్రమే ఉంచి ప్రాథమికోన్నత పాఠశాలలను రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో సగటున 15 మంది విద్యార్థులకు ఓ ఉపాధ్యాయుడు ఉన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలను ఎత్తివేయడం ద్వారా అక్కడి ఉపాధ్యాయులను ఈ స్కూళ్లలో సర్దుబాటు చేయవచ్చనేది కూడా ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. అంతేకాదు, అవసరమైన చోట్ల ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా మార్చాలని కూడా యోచిస్తోంది. ప్రాథమికోన్నత పాఠశాలలను రద్దు చేయడం ద్వారా ప్రాథమిక పాఠశాలల్లో భాషా పండితులను నియమించాలన్న డిమాండ్ కూడా నెరవేరుతుందని ఉపాధ్యాయ సంఘ నేత ఒకరు తెలిపారు.ఉన్నత పాఠశాలలు గ్రామాలకు,ఇళ్లకు దూరంగా ఉండడంతో డ్రాపౌట్లు పెరుగుతున్నాయన్న ఉద్దేశంతో 1996, 2001లో అప్పటి ప్రభుత్వాలు వందల సంఖ్యలో పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేశాయి. అయితే, ఆ తర్వాత ప్రజా రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో వీటి అవసరం తగ్గిందని భావించిన ప్రభుత్వం వాటిని ఎత్తివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos