స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు

స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు

ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో వ్యాపారాల్ని ఆరంభించాయి. ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో బీఎస్ఈ సెన్సెక్స్ 392 పాయింట్ల లాభంతో 39,089 వద్ద, నిఫ్టీ 111 పాయింట్ల వృద్ధితో 11,528 వద్ద ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.57గా దాఖలైంది. ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, విప్రో లిమిటెడ్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్ని గడించాయి. గెయిల్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టాల పాలయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos