మోదీ షోమ్యాన్ ప్రధాని

మోదీ  షోమ్యాన్ ప్రధాని

న్యూ ఢిల్లీ: కరోనా వల్ల అష్ట కష్టాలు పడుతున్న ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన ఎలాంటి ఉపశమనాన్ని కలిగించ లేదని కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ శుక్రవారం ట్విట్టర్లో విమర్శించారు. ‘ప్రజల అగచాట్లు, వారిపై పడుతున్న భారం, ఆర్థిక ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోలేదు. భవిష్యత్తు దృష్టి ఏమిటో, లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత పరిస్థితులు మెరుగుపరచేందుకు ఏం చర్యలు తీసుకోనున్నారో ప్రస్తావించ లేద’ని తప్పు బట్టారు. ‘మోదీ ప్రధాన షోమ్యాన్గా, ఫోటోలకే పరిమితమయ్యే ప్రధాని’గా ఎద్దేవా చేసారు. కరోనా చీకట్లను తరిమికొట్టేందుకు దేశ ప్రజలంతా ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాట్లు లైట్లు ఆర్పేసి కొవ్వొత్తి, దీపం వెలిగించాలని మోదీ కు ఇచ్చిన పిలుపుపై పెదవి విరిచారు. ఇదొక ‘ఫీల్ గుడ్ మూమెంట్’ మాత్రమేనని పెదవి విరిచారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos