సంపూర్ణేశ్ బాబు అభిమాని హంగామా..

సంపూర్ణేశ్ బాబు అభిమాని హంగామా..

తన అభిమాన నటుడి చిత్రాన్ని తమ ప్రాంతంలో విడుదల చేయలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు సెల్‌టవర్‌ ఎక్కి హంగామ సృష్టించాడు. తెలుగు కామెడీ హీరో సంపూర్ణేశ్‌బాబు నటించిన కొత్త చిత్రం కొబ్బరిమట్ట చిత్రం రాష్ట్రమంతటా విడుదలైనా చిత్తూరు జిల్లాలోని మదనపల్లె పట్టణంలో విడుదల కాలేదు.దీంతో పట్టణ సమీపంలోని నీరుగట్టువారిపల్లెలోని బాబుకాలనీకి చెందిన రెడ్డెప్ప అనే యువకుడు స్నేహితులతో కలిసి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమా విడుదల చేయాలని దర్శకనిర్మాతలను కోరాడు. వారు స్పందించకపోవడంతో  మనస్తాపం చెంది స్థానిక అయోధ్యనగర్ లోని సెల్ టవర్ ఎక్కాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్లు వెంటనే టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫోన్ చేసి రెడ్డెప్పతో మాట్లాడారు. కిందకి దిగొస్తే న్యాయం చేస్తామని చెప్పినా.. సాయంత్రం ఆరు గంటల వరకు సెల్ టవర్ పైనే ఉండిపోయాడు రెడ్డెప్ప. స్థానికులు పెద్ద సంఖ్యలో  అక్కడకి చేరుకోవడంతో రెడ్డెప్ప మరింత రెచ్చిపోయాడు. మిగిలిన హీరోల సినిమాలైతే విడుదల చేస్తారు.. సంపూర్ణేష్ బాబు సినిమాను ఎందుకు విడుదల చేయరంటూ పోలీసులను ప్రశ్నించాడు.తరువాత రెడ్డెప్ప చిన్నమ్మ కొడుకు ప్రశాంత్ ని సెల్ టవర్ ఎక్కించి రెడ్డప్పను కిందకు దింపే ప్రయత్నం చేయడంతో అరగంట తరువాత అతడు కిందకు దిగొచ్చాడు.రెడ్డెప్ప మద్యం తాగి ఉండడంతో పోలీసులు జీపులో స్టేషన్ కి తరలించారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos