కళ్లు చెదిరే సాహో బిజినెస్

  • In Film
  • August 19, 2019
  • 65 Views
కళ్లు చెదిరే సాహో బిజినెస్

హైదరాబాద్‌ : ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న  `సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. నైజాం ఏరియాలో రూ.40 కోట్లు, సీడెడ్‌లో రూ.25 కోట్లు, కృష్ణాలో రూ.8 కోట్లు, గుంటూరులో రూ.12.50 కోట్లు, నెల్లూరులో రూ.4.50 కోట్లు, వెస్ట్, ఈస్ట్ ఏరియాల్లో రూ.19 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.16 కోట్లు, మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.125 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. కర్ణాటకలో రూ.28 కోట్లు, తమిళనాడు, మిగిలిన చోట్ల రూ.18 కోట్లు, బాలీవుడ్‌లో రూ.120 కోట్లు, విదేశాల్లో రూ.42 కోట్ల మేర ప్రీ రిలీజ్ వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. మొత్తంగా దాదాపు రూ.333 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఆగస్టు 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos