ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు..

ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు..

దిశ నిందితుల ఎన్కౌంటర్పై సినీ నటి పూనం కౌర్ స్పందించింది. నిందితుల్ని ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది. ఎన్కౌంటర్ అభినందనీయమని పేర్కొంది. దిశ ఘటన తనలో ఎంతో ఆవేదనను, ఆందోళనను  నింపిందని పేర్కొంది. నిందితులకు ఇంత త్వరగా శిక్ష పడినందుకు సంతోషంగా ఉందని, ఇలాంటి దుర్మార్గులకు అదే సరైన శిక్ష అని పేర్కొంది. భవిష్యత్తులో మరే ఆడపిల్లకూ ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులకు, ప్రభుత్వానికి ఉందని పూనం తెలిపింది.కాగా, తాను చేసిన మరో ట్వీట్ను పూనం కాసేపటికే డిలీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, అప్పటికే అది బయటకు వెళ్లిపోయింది. అందులో.. తనతోపాటు పలువురి మహిళలను మోసం చేసిన సినీ అలియాస్ రాజకీయ  నాయకులను కూడా శిక్షిస్తారని భావిస్తున్నానని పేర్కొన్న పూనం.. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు అని పేర్కొంది. దిశ ఘటనపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇటీవల మాట్లాడుతూ నిందితులకు రెండు బెత్తం దెబ్బలు చాలని వ్యాఖ్యానించారంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు అవే మాటలను పూనం ఉపయోగించడంపై చర్చ మొదలైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos