స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో హీరో రామ్చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మిస్తున్న సైరా విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలపై దృష్టా సారించింది.ఈ క్రమంలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రెండు రోజుల ముందు అంటే ఈనెల 20వ తేదీన విడుదల చేయడానికి నిర్ణయించుకుంది.అయితే టీజర్లో సంథింగ్ స్పెషల్ ఉండాలనే భావనతో జనసేన అధినేత పవన్కళ్యాణ్తో వాయిస్ ఓవర్ ఇప్పించినట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఇక పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన మేకింగ్ ప్రోమోను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. అన్నయ్య చిరంజీవి పక్కనే ఉండి తమ్ముడికి వివరిస్తున్న తీరు ప్రోమోలో ఆకట్టుకుంటోంది..