అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిన ప్రభాస్ నటించిన కొత్త చిత్రం సాహోపై తెదేపా శ్రేణులు,కార్యకర్తలు వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.ఈనెల 30వ తేదీన చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం రామోజీ ఫిల్మ్సిటీలో భారీస్థాయిలో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు.అందులో ప్రభాస్తో పాటు ప్రభాస్ పెదనాన్న,బీజేపీ నేత కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై తెదేపా శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. కార్యక్రమంలో కృష్ణంరాజు చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేయగా ప్రభాస్ సైతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రశంసలు కురిపించడాన్ని జీర్ణించుకోలేని కొందరు టీడీపీ అభిమానులు ఇప్పుడు సాహో చిత్రం పై సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో సైతం ఇదే విధంగా వ్యతిరేక ప్రచారం చేయగా ఇప్పుడు అదే తరహాలో ప్రభాస్ టీడీపీ శ్రేణులకు టార్గెట్ అవుతున్నారు. మధ్యలో జక్కన్న రాజమౌళిని సైతం మధ్యలోకి లాగడం చర్చనీయాంశమైంది. రాజమౌళి సినిమాలో నటించిన అనంతరం ఏహీరోకైనా ఫ్లాపులేనని అందుకు ప్రభాస్ మినహాంపేమి కాదని సాహో చిత్రం కూడా ఫ్లాప్ అవుతుందంటూ వ్యతిరేక ప్రచారం చేస్తున్నట్లు సమాచారం..