నస్టాలే నష్టాలు

ముంబై: కరోనా పీడితుల సంఖ్య పెరగడం స్టాక్ మార్కెట్ల నూ ప్రభావితం చేసింది. మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఫైనాన్స్, ఆటొ మొబైల్స్ రంగాలు భారీ నష్టాలను మూట గట్టు కున్నాయి. సోమవారం సెన్సెక్స్ 1,375 పాయింట్లు నష్టపోయి 28,440కి, నిఫ్టీ 379 పాయింట్లు కోల్పోయి 8,281కి దిగజారాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో టెక్ మహీంద్రా (4.94%), నెస్లే ఇండియా (4.49%), యాక్సిస్ బ్యాంక్ (2.50%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.19%), టైటాన్ కంపెనీ (0.77%), లాభాల్ని గడించాయి. బజాజ్ ఫైనాన్స్ (-11.95%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-10.92%), టాటా స్టీల్ (-8.36%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-7.96%), ఐసీఐసీఐ బ్యాంక్ (-7.67%). ఎక్కువగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos