అమరావతి : వైకాపా అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ ఉద్దేశాలతో చేస్తున్నవేనని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఆయన ఓ తెలుగు టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జగన్పై రూ.లక్ష కోట్ల అవినీతి ఆరోపణ అనేది రాజకీయ ప్రచారం కోసం చేసినట్లుగా ఉందని అన్నారు. ఈ కేసులను లక్ష్మీనారాయణ దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే. తన వద్ద ఉన్న ఆధారాలను ఛార్జిషీట్లో పొందుపర్చానని, దాని ప్రకారమైతే రూ.1,500 కోట్లు మాత్రమేనని తెలిపారు. రూ.లక్ష కోట్లు కాదన్నారు. జగన్పై ఆరోపణలు చేసి, ఎవరో రాజకీయంగా వాడుకునిఉంటే తామేమీ చేయలేమని అన్నారు. లక్ష్మీనారాయణ లోక్సభ ఎన్నికల్లో విశాఖపట్నం స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.