మంత్రివర్గ కూర్పు వెనక ఆసక్తికర అంశం…

మంత్రివర్గ కూర్పు వెనక ఆసక్తికర అంశం…

ఎన్నికల ఫలితాలు వెలువడ్డ సుమారు 70 రోజులకు తెలంగాణలో
పది మంది ఎమ్మెల్యేలతో మంత్రివర్గం కోలువుదీరింది.అయితే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి
తెరవెనుక జరిగిన ఒక ఆసక్తికర అంశం వెలుగు చూసినట్లు తెలుస్తోంది.మంత్రి వర్గంలో ఎవరికి
స్థానం కల్పించాలనే విషయంపై సీఎం కేసీఆర్‌ ముందుగానే ఫైనల్‌ చేసుకున్నారని తెలుస్తోంది.సీఎం
కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకున్న అనంతరం తెరాస పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
మంత్రి పదవులు దక్కిన ఎమ్మెల్యేలను పిలిపించుకొని మంత్రి పదవి దక్కిన వార్త తెలియజేసి
వారిని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసినట్లుగా తెలుస్తోంది. మంత్రి పదవి ఖరారైంది..బయటకు వెల్లడించకండి.. అధికారికంగా మేమే చెబుతాం. అప్పటివరకూ పొక్కనీయకండన్న మాట కేటీఆర్ నోట వచ్చినట్లుగా తెలుస్తోంది. .. తమకు చేసిన మేలును జీవితంలో మర్చిపోలేమన్న మాటను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎమోషనల్ సీన్లు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంతోనే మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం రోజున.. రాజ్ భవన్ వద్దకు వచ్చిన కేటీఆర్ పట్ల మంత్రులు వినయ విధేయతలు ప్రదర్శించినట్లుగా చెబుతున్నారు.అయితే.. మల్లారెడ్డి విషయం మాత్రం ఇందుకు మినహాయింపుగా చెబుతున్నారు. చివర్లో మల్లారెడ్డి పేరును యాడ్ చేసినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే.. మంత్రి పదవులు ఎవరికి కేటాయించారన్న విషయాన్ని ఎవరికి వారికి వ్యక్తిగతంగా సమాచారాన్ని చేరవేసినట్లుగా తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos