చైనా సైనికుణ్ని తిరిగి అప్పగించిన భారత్

చైనా సైనికుణ్ని తిరిగి అప్పగించిన భారత్

న్యూ డిల్లీ : భారత భూ భాగంలోకి ప్రవేశించిన చైనా సైనికుడుకార్పరల్ వాంగ్ యా లాంగ్ను చుషూల్ మోల్డో మీటింగ్ పాయింట్ వద్ద భారత సైన్యం మంగళవారం రాత్రి చైనా సైన్యానికి అప్పగించింది. తూర్పు లద్దాఖ్లో దెమ్చోక్ వద్ద వాంగ్ యా లాంగ్ను భారత సైన్యం అదుపులోకి తీసుకుని, అతని నుంచి పౌర, సైన్యానికి సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ సైనికుడు గూఢచారిగా భారత్కు వచ్చారా? లేక మరేదైనా ప్రణాళికతో వచ్చారా అనే అంశంపై భారత సైన్యం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం శిఫ్టాచారాన్ని అనుసరించి వాంగ్ను చైనాకు అప్పగిస్తామని ఇచ్చిన భరోసాను మన సైన్యం నిలబెట్టుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos