ఎట్టకేలకు ఫలించిన దయాకర్రావు కల…

ఎట్టకేలకు ఫలించిన దయాకర్రావు కల…

తన మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నడు కలగని సంతోషం ఇవాళ కలుగుతోందంటూ ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు.శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పంచాయితీరాజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు.సీఎం కేసీఆర్‌ మంత్రివర్గంలో కీలకమైన పంచాయితీ రాజ్‌శాఖ లభించడం నిజంగా సంతోషంగా ఉందన్నారు.తనకు గతంలోనే మంత్రి పదవి రావాల్సిందని గుర్తు చేసుకున్న దయాకర్‌ రావు గతంలో ఎన్టీఆర్‌ కూడా తనకు మంత్రి పదవి ఇవ్వడానికి ఆసక్తి కనబరిచారని అయితే కొన్ని దుష్టఃశక్తులు తనకు మంత్రి లభించకుండా అడ్డుకున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యేగా,పీఏసీ సభ్యుడిగా పని చేసామని అయినా తనకు మంత్రి పదవి దక్కలేదన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెదేపా అధికారంలో ఉన్నసమయంలో అప్పటి సీఎం చంద్రబాబు కూడా తమకు మంత్రిపదవి ఇస్తామని మోసం చేసారంటూ ఆరోపించారు. ఇన్నాళ్లకు తన కల నెరవేరిందని చెప్పారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో పదవీ ఇవ్వలేదని సర్దిచెప్పారని .. ఆనాడు జరిగిన చేద ఘటనను గుర్తుచేస్తుకున్నారు. కానీ సీఎం కేసీఆర్ తనకు మంత్రి పదవీ ఇచ్చారని .. బాధ్యతగా పనిచేస్తానని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ కీలకమైన పంచాయతీశాఖను తనకు అప్పగించడంపై ఎర్రబెల్లి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతానని స్పష్టంచేశారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతానని స్పష్టంచేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos