ప్రతీ ఇంటిలో ప్యాన్లు ఉంటాయి.. గతంలో గాజు గ్లాసు పగిలి పోయింది

ప్రతీ ఇంటిలో ప్యాన్లు ఉంటాయి.. గతంలో గాజు గ్లాసు పగిలి పోయింది

కాకినాడ: ప్రజలకు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. జగన్ పాలనలో పేదలు తృప్తిగా ఉన్నారని ముద్రగడ పేర్కొన్నారు. ప్రతీ ఇంటిలో ప్యాన్లు ఉంటాయని.. గతంలో గాజు గ్లాసు పగిలి పోయిందన్నారు. ఆ ముక్కలు అందరికి ప్రాణహానిని కలిగిస్తాయని, గాజు గ్లాసుకి బదులు స్టీలు గ్లాసులు వాడుతున్నారన్నారు. టీడీపీ సైకిల్ తుప్పు పట్టడం వల్ల ఎవ్వరూ సైకిల్ వాడడం లేదన్నారు. అందరి ఇళ్ళలో ఫ్యాన్లు ఉండడం వల్ల చల్లటి గాలి స్వీకరిస్తు న్నామన్నారు. ఆ ఫ్యాను గుర్తే మన జగన్దని ముద్రగడ పేర్కొన్నారు. జగన్కి ఓటు వేసే విషయంలో తప్పు చేస్తే శాశ్వతంగా నష్టపోతామన్నారు. ఆ తరువాత వచ్చే పాలకులు రాక్షస పాలన చూపిస్తారని ముద్రగడ లేఖలో తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos