దుబ్బాక లో కమల వికాసం

దుబ్బాక లో కమల వికాసం

సిద్దిపేట : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం నమోదైంది. సమీప ప్రత్యర్థి తెరాస అభ్యర్థిని సుజాతపై 1470 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో భాజపా అభ్యర్థి రఘునందన రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్ఎస్ కంచుకోటలో తొలిసారి కాషాయ జెండా ఎగరేసింది. టీ-20 మ్యాచ్లా సాగిన పోరులో మొదటి పది రౌండ్స్లో బీజేపీ పూర్తిస్థాయి ఆధిక్యం కనబర్చగా.. అనుహ్యంగా పుంజుకున్న టీఆర్ఎస్ 11 నుంచి 20 రౌండ్ వరకు ఆధిక్యంలోకి దూసుకొచ్చి బీజేపీకి సవాలు విసిరింది. ఒక దశలో టీఆర్ఎస్ విజయం ఖాయమనే రీతిలో ఆధిక్యం కనబర్చింది. పడిలేచిన కెరటంలా చివరి నాలుగు రౌండ్స్లో భాజపా ఉత్కంఠకు తెరదించింది. వరుసగా 20,21,22,23 రౌడ్స్లో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చి.. సంచలన విజయాన్ని నమోదు చేసింది. దుబ్బాక విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos