నా తండ్రిని నితీశ్ అవమానించారు

నా తండ్రిని నితీశ్ అవమానించారు

పాట్నా : తన తండ్రి రాం విలాస్ పాశ్వాన్ను ముఖ్యమంత్రి నితీశ్ ఘోరంగా అవమానించారని ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఫిర్యాదు చేసారు. ‘ రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల సమయంలో నితీశ్ తన తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ ను తీవ్రంగా అవమానించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఒక రాజ్యసభ సీటును రాం విలాస్కు కేటాయించాలని ఒప్పందం సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్షా సమక్షంలోనే జరిగింది. అయినా సరే… సీటును కేటాయించే సమయంలో నితీశ్ రాంవిలాస్ పాశ్వాన్ను ఘోరంగా అవమానించారు. బిహార్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. బీజేపీపై ప్రజల్లో ఏమాత్రం అభిమానం తగ్గలేదు. బీజేపీ నిర్ణయాల్ని వ్యతిరేకించను. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఒక్క అడుగు కూడా వేయన’ని అందులో పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos